Thursday, May 2, 2024
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…16 మంది దుర్మరణం

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదుపు తప్పిన ట్రక్కు అదే రోడ్డులో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.ప్రమాదంలో పదహారు మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.

షాజహాన్‌పూర్‌ జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో నడుపుతున్న ట్రక్కుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదే రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టాడు.క్కు వేగం కారణంగా వ్యాన్‌ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. క్షణాల్లోనే ట్రక్కు కూడా వ్యాన్‌పై బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లోని 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి.సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేమ అందించాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -