Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీలో వాక్సిన్ పంపిణీ.. ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన..!

- Advertisement -

ఢిల్లీలోని ప్రజలందరికీ టీకా పంపిణీ చేసేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలతో పాటు బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ వంటివి పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. టీకా అందుబాటులోకి వస్తే 3,4 వారాల్లోనే ఢిల్లీ ప్రజలకు పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు.

కొవిడ్‌ వ్యాక్సిన్ పురోగతిపై ప్రధాని పర్యటనపై స్పందించేందుకు సత్యేంద్ర జైన్ నిరాకరించారు. ఢిల్లీలో కొత్తగా 5,482 మంది వైరస్​ బారిన పడ్డారు. ఢిల్లీలో ఎప్పుడైతే టీకా అందుబాటులోకి వస్తుందో కొన్నివారాల్లోనే ఢిల్లీ అంతటా పంపిణీ చేస్తాం. మా వద్ద చాలా ఆరోగ్య వసతులున్నాయి.

మొహల్లా క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు వంటి అనేక మౌలిక వసతులు ఉన్నాయి. నిల్వ సమస్యే లేదు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఢిల్లీ అంతటా 3, 4 వారాల్లోనే పంపిణీ చేసే సామర్థ్యం మాకు ఉంది అని ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -