చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో… ఇటీవలే ఇండియాలో వివో వీ11 ప్రో రిలీజ్ చేసింది. కొన్ని రోజుల్లోనే వివో వీ11 తీసుకొచ్చింది. వివో వీ11 సెప్టెంబర్ 27 నుంచి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ పవర్ఫుల్ ర్యామ్ను ఇందులో అమర్చారు. 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలు ఆఫర్లు వినియోగదారులకు లభిస్తాయి. క్యాపిటల్ ఫస్ట్ ఈఎంఐతో ఫోన్ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు. పేటీఎం మాల్తో కొనుగోలు చేస్తే రూ.2వేల క్యాష్బ్యాక్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.2వేల క్యాష్బ్యాక్ ఇస్తారు. అలాగే ఫ్లిప్కార్ట్లో ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ.2వేలు అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఇక ఈ ఫోన్పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. రిలయన్స్ జియో ఈ ఫోన్ను కొనుగోలు చేసే వారికి రూ.4050 విలువైన బెనిఫిట్స్ను అందిస్తుంది.
వివో వి11 ఫీచర్లు…
6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.