Sunday, May 12, 2024
- Advertisement -

బ్రిటన్ యువరాజుకు ఘన స్వాగత ఏర్పాట్లు

- Advertisement -

బ్రిటన్ యువరాజు భారత పర్యటనకు అన్ని సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 10న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, ఆయన భార్య కెట్ మిడిల్ టన్ భారత పర్యటనలో భాగంగా ముంబాయ్ రానున్నారు. ఇందుకోసం వీరికి ఘన స్వాగతం పలికేందుకు ముంబాయ్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

తాజ్ మహల్ ప్యాలెస్ లో వీరిద్దరు బస చేస్తారు. ఇక ముంబాయ్ లోని బాలలతో కలిసి వీరిద్దరు స్ధానిక వెంగ్ సర్కార్ స్టేడియంలో క్రికెట్ ఆడతారు.ఈ కార్యక్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొంటారు. అనంతరం ఔత్సాహి పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. తాజ్ క్రిస్టల్ లో క్రీడలు, వ్యాపార, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో బ్రిటీష్ యువరాజు దంపతులు విందులో పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులను మాత్రమే ఆహ్వానించింది బ్రిటీష్ హై కమిషన్. దీనికి వచ్చే వారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా తీసుకురాకూడదని నిబంధన విధించింది. రాజు గోరు తలచుకుంటే మాటలా మరి..

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -