Thursday, May 2, 2024
- Advertisement -

కొత్త దర్శకుడితో సినిమాకి రెడీ అవుతున్న రవి తేజ!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మొత్తానికి 2021 క్రాక్ సినిమాతో సంక్రాంతి విన్నర్ గా ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు. అంతకు ముందు వరకు వరుస ప్లాపులతో ప్రమాదంలో ఉన్న రవితేజ క్రాక్ సినిమాను ఏ ముహూర్తన స్టార్ట్ చేశాడో గాని సమస్యలు ఎన్ని వచ్చినా కూడా తగ్గలేదు. మొదటిసారి బాక్సాఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ కొట్టేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు.ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అలానే ఉండాలని మాస్ రాజా చాలా బలంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఖిలాడి సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత మాస్ రాజా ఒక కొత్త దర్శకుడితో సినిమా చేస్తాడట. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గులాబీ శ్రీను చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతుంది.

కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తరువాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన గులాబీ శ్రీను మాస్ రాజాకు గత ఏడాది నుంచి ఒక కథ చెబుతున్నాడు.మధ్యమధ్యలో కొన్ని మార్పులు చేసి ఇటీవల ఫైనల్ నరేషన్ ఇవ్వడంతో రవితేజకు బాగా నచ్చేసిందట. ఖిలాడి అనంతరం ఈ కొత్త దర్శకుడి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -