మొదట్లో నైటీలు అనేవి సీటీలో మాత్రమే ధరించేవారు.రాను రాను ఈ కల్చర్ పల్లెటూరుకి కూడా పాకింది.ఇప్పుడు పల్లెటూరు మహిళలు కూడా నైటీలు ధరిస్తున్నారు.అయితే ఒక ఊరులో మాత్రం మహిళలు నైటీలు ధరిస్తే జరిమానా విధిస్తారు.ఇది మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో మహిళలు నైటీలు ధరిస్తే జరిమానా విధిస్తారు.పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని తోకలపల్లి గ్రామంలో ఎవరైనా మహిళలు నైటీలు ధరిస్తే.. రూ.2వేలు ఫైన్ కట్టాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అలా ఎవరైనా నైటీ వేసుకోవడం చూసి గ్రామపెద్దలకు చెబితే.. చెప్పినవారికి రూ. వెయ్యి బహుమతి ప్రకటించారు. దీనిపై గ్రామంలో ప్రచారం కూడా చేయించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో గురువారం నిడమర్రు తహశీల్దార్ ఎం.సుందర్రాజు, ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకున్నారు.
గ్రామపెద్దలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికుల్లో ఏ ఒక్కరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. తెలుగు సంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలు ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామపెద్దలు స్పష్టం చేశారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు. రాత్రి సమయంలో మాత్రం ఈ నిబందనకు మినహాయింపు ఇచ్చారు.తెలుగు సంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే తపనతో పని చేస్తున్నా ఈ గ్రామ పెద్దలను అందరు ప్రశంసిస్తున్నారు.