వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిచెందడంతో ఆ అక్కసుతో వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.
సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని వారి పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గెలిచింది అనే అక్కసుతో టీడీపి నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు,లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలోను అసభ్యకర పోస్ట్ లు పెడుతున్న వారిపైనా చర్యలు తీసుకోవాలి అని డీజీపీ ని కోరారు ఆర్కే. టీడీపీ వ్యూహాత్మకంగా దాడులు చేసి, వాటిని వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందన్నారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు.