Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ తప్పు చేస్తున్నాడా…?

- Advertisement -

వైసీపీ అధినేత తప్పు చేస్తున్నాడు అనే కంటే…. చేసేశాడు అనడం చాలా ఉత్తమం. అమరావతి శంకుస్థాపనకు తాను రావడం లేదని చెప్పడం, దానికి బలవంతంగా భూములు లాక్కోవడమే కారణమని సెలవివ్వడం చూస్తుంటే… జగన్ ఎంత తప్పు చేస్తున్నాడో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. పొలిటికల్ సర్క్యూట్ లో చెపుకునేదేంటంటే…

 ఇలాంటి మెరుపు లాంటి ఆలోచనలు రావడానికి రీజన్ …. జగన్ ఒంటెద్దు పోకడలే కారణమంటున్నారు. అయితే అతని చుట్టూ ఉండే వారు చెబుతున్నదాని ప్రకారం.. ఈనిర్ణయం జగన్ తీసుకున్నది కాదని.. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు ఈమధ్య వైసీపీలోకి వచ్చి చేసిన ఘనకార్యమే… జగన్ ఇలాంటి లేఖ రాయడానికి కారణమని చెబుతున్నారు. మొన్నటి వరకూ జగన్ పై ఒంటె కాలు మీద లేచి రీసెంట్ గా వైసీపీలోకి వచ్చిన ఆ మహానాయకుడు మెరుపులాంటి దూరాలోచనతోనే ఇలా అయిందని అంటున్నారు.  విచిత్రమేమిటంటే.. జగన్ ఆ లేఖ ఇచ్చేది  వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలకు తెలియకుండానే జరిగిందనేవారు కొందరున్నారు. అయితే వారు మేల్కొనే లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది.

లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోను జగన్ చేత ఆ లేఖను ఇప్పించి తప్పిదం చేయించే వారు కాదంటున్నారు. ఏమాటకు ఆ మాట చెపుకోవాలి గాని…. జగన్ తన పక్కనున్నవారిలో ఎవరు తనవారు ఎవరు కాని వారనేది ఒకసారి మళ్లీ పునరాలోచించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇంకా ఎవరెవరు జగన్ కు అవి ఇవి ఎక్కించి ఇంకా ఎన్ని తప్పిదాలు చేయిస్తారో. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -