Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ కు ఆ జిల్లా రియాక్షన్ అర్థం కావడం లేదా?!

- Advertisement -

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల బాగా ఆదరణ చూపిన జిల్లా అనంతపురం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత తెలుగుదేశం పార్టీని బాదా ఆదరించిన జిల్లా అనంతపురం.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ దాదాపుగా స్వీప్ చేసింది. ఏకంగా 14 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ పన్నెండింటిని గెలచుకొంది.కేవలం రెండు సీట్లలో మాత్రమే వైకాపా గెలిచి నిలిచింది.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వరసగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఈ మధ్యకాలంలో జగన్ వరసగా అనంతపురం వెళ్లి వచ్చాడు. అక్కడ రైతులను, డ్వాక్రా మహిళలను పరామర్శిస్తున్నాడు. హత్యలకు గురైన వైకాపా నేతల కుటుంబాలను కూడా పరామర్శించి వస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో జగన్ కు అక్కడ కనిపిస్తున్న ఆదరణ  బ్రహ్మాండంగా ఉంది!  జగన్ ఎప్పుడు వచ్చినా జనాలు బాగా వస్తున్నారు. ఎండలు మండిపోతున్నా.. జగన్ రెడ్డి సభలకు జనాలు తగ్గడం లేదు. అయితే  జనాదరణను చూసి జగన్ మోహన్ రెడ్డి మురిసిపోవడానికి ఏమీ లేదిక్కడ. ఎందుకంటే.. ఎన్నికల ముందు కూడా అనంతపురం వంటి జిల్లాలో జగన్ సభలకు ఇదే స్థాయి ఆదరణ కనిపించింది. జనాలు ఇలాగే బీభత్సమైన స్థాయిలో వచ్చారు.

అయితే తీరా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. వైకాపా కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైకాపాకు ఉన్న పట్టుపై క్లారిటీ లేకుండా పోతోంది. ఎన్నికలు జరిగితే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -