- Advertisement -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడింది. తాడేపల్లిలో నిర్మించిన నూతన గృహ ప్రవేశం ఈనెల 14న ఉదయం 11 గంటలకు చేయాల్సిఉంది. అయితే అనుకోని కారణంగా వాయిదా పడింది. ఇంటి నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేస్తే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఫిభ్రవరి 11 సోమవారం జగన్ సతీమణి వైఎస్ భారతి అమరావతిలో ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంటి పనులపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన గృహప్రవేశానికి సంబంధించి ఆహ్వానాలు పంపారు.ఇప్పటికే ఆహ్వానాలు పంపడంతో ఎల్లుండి గృహప్రవేశంపై సందిగ్ధత నెలకొంది.