- Advertisement -
వైసీపీ అధినేత జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రేపు ఢిల్లీకి వెళుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాకోసం ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆమరణ నిరహార దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే.
వారిని పరామర్శించేందుకు లోక్సభ సభ్యుల దీక్షా శిబిరాన్ని ఆమె రేపు (ఆదివారం) సందర్శించనున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుప్రతిలో చికిత్స పొందున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా ఆమె పరామర్శించనున్నారు.
జగన్ పాదయాత్రలో ఉండటం వల్ల… ఆయన తరపున విజయమ్మ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు వైసీపీ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది.