ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘‘వంచనపై గర్జన దీక్ష’’లో ఆయన పాల్గొన్నారు.. ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ఇద్దరు కలిస్తే హోదా వస్తుందని చెప్పారని కానీ ప్రత్యేకహోదా రాలేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వంచనపై గర్జన దీక్షను టీడీపీ, బీజేపీ వంచనపై గర్జనగా అభివర్ణించారు. ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతిని గుర్తుచేశారు. హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు.