రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాలన చేస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. బాబు హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై త్వరలోనె విచారణ జరపనున్నారనె వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ముందుగా కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరింయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈవ్యాఖ్యలు బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద సుమారు 600 ఎకరాల్లో.. రూ. 13 వేల కోట్ల వ్యయంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల దాదాపు మూడువేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎల్లో మీడియా, చంద్రబాబుకు కొట్టుకున్న సొంత డబ్బా అందరికి తెలిసిందే.ఇందులో పెద్ద స్కాం జరిగిందని…త్వరలో ఇది బట్టబయలు కానుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.
కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని వ్యభిచారం చేయడం మొదలు పెట్టాయి. దొంగ ఏడుపులు వద్దని, యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలుసని, కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని విజయసాయిహెచ్చరించారు.