Wednesday, April 24, 2024
- Advertisement -

కాల్‌మ‌నీ, సెక్స్ రాకెట్ సూత్ర‌ధారి ఎవ‌రో చెప్పేసిన జీవీఎల్‌

- Advertisement -

విజ‌య‌వాడ‌లో క‌ల‌కలం సృష్టించిన కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ మ‌రోసారి ఇప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల ఆర్థిక అవ‌స‌రాల‌ను
వారి పెట్టుబ‌డిగానే ఈ దందా నిర్వ‌హించారు కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ నిర్వాహ‌కులు. అధిక వడ్డీని వసూలు చేసి అసలు వసూలు చేయకుండానే ఆ ముసుగులోనే అప్పులు తీసుకున్న సంబంధీకులను లోబరుచుకోవ‌డం.. వారిని వేధింపుల‌కు గురి చేసేవారు. ఇదంతా విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగింది. కొంద‌రు దుర్మార్గులైతే గోవా లాంటి ప్రాంతాలకు అమ్మాయిలను కూడా సరఫరా చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేల‌ల్లో వడ్డీలు కట్టలేక సదరు వడ్డీ వ్యాపారులు పెడుతున్న ఇబ్బందులను సాక్ష్యాత్తు సీపీ ఎదుటే వెల్లబోసుకోవడంతో ఈ విషయం వెలుగలోకి వచ్చింది.

ఇప్పుడీ కాల్ మ‌నీసెక్స్ రాకెట్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కు బుద్ధా వెంకన్నే సూత్రధారని జీవీఎల్ ఆరోపించారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశాన‌న్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు జీవీఎల్‌. ఏపీలో జ‌రుగుతున్న‌ తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని అన్నారు.

జీవీఎల్ వ్యాఖ్య‌లు కొంత సంచ‌లనాన్ని సృష్టించాయ‌నే చెప్పాలి. అప్ప‌ట్లో ఈ నిర్వాహ‌కుల వెనుక టీడీపీ నేత‌లు ఉన్నార‌ని.. ఆ నేత‌లే వారిని ర‌క్షిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు జీవీఎల్ డైరెక్ట్‌గా బుద్ధా వెంక‌న్నే కీల‌క సూత్ర‌ధాని అని ప్ర‌క‌టించ‌డం డైరెక్ట్‌గా ప్ర‌క‌టించ‌డం.. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌మ‌నే చెప్పాలి. మ‌రి కేంద్రం ఈ ఫిర్యాదును సీరియ‌స్‌గా తీసుకొని ద‌ర్యాప్తుకు ఆదేశిస్తుందా? వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -