Thursday, April 25, 2024
- Advertisement -

సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేశాం

- Advertisement -

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగే వారికి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ సిద్ధం చేశామనీ.. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమంటూ హెచ్చరించారు.

చంద్రబాబును కానీ ఆయన కుటుంబ సభ్యలను కానీ తిడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబును తిడితేనో.. టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తేనో పదవులు వస్తాయని కొందరు కలలుకంటున్నారనీ.. అలాంటి వారికి బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించినందుకే సీనియర్లను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఎవరైనా సరే నోరు అదుపులోకి పెట్టుకోకపోతే సూసైడ్‌ బ్యాచ్ రంగంలోకి దిగుతుందన్నారు. బుద్ధా వెంకన్న చేసిన ఈ వ్యాఖ్యలపై చర్చజరుగుతోంది.

హనుమాన్ దీక్ష తీసుకున్న ఎన్టీఆర్

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

ఉచితాలు కొంప ముంచుతాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -