Sunday, April 28, 2024
- Advertisement -

క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు బాబుకు చంప‌పెట్టు.. భాజాపా నేత రామ్‌మాధ‌వ్

- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ తో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా భాజాపా హ‌వా కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ శ్రేణులు, చంద్ర‌బాబు భాజాపాను ఓడించాల‌ని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌ర్నాట‌క ఫ‌లితాల త‌ర్వాత భాజాపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ బాబునుద్దేశించి ట్వీట్ చేశారు.

“కర్ణాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అన్ని రకాల వ్యూహాలను పన్నారు. కానీ, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించింది. మా స్థానాలను 6 నుంచి 20కి పెంచుకున్నాం. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో 40 స్థానాలకు గానూ.. 20 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. 2013లో ఈ ప్రాంతంలో 6 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయన్నారు రాంమాధవ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -