Sunday, May 19, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

కోటా శ్రీనివాస‌రావు ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వూలో రోజాతో పాటు జ‌గ‌న్‌పై కూడా కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌నిలోప‌నిగా తెలుగు రాష్ట్రాల్లో భాజాపా పార్టీ ప‌రిస్థితిపై కూడా వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా బీజేపీకి విలువ, గౌరవం ఉన్నాయని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి చేసే నాయకులు లేర‌న్నారు . తెలుగు రాష్ట్రాల్లో భాజాపా పాగా వేయాల‌ని చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రాంతీయ పార్టీల‌ముందు భాజాపా నిల‌బ‌డ‌లేక‌పోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం బీజేపీకే కష్టమే’ అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల్గుతామంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసే వ్యాఖ్యల విషయ మై కోటను ప్రశ్నించగా..‘సరే లెండి, పార్టీలో లీడర్లుగా ఉన్నవాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు,‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్మోహన్ రెడ్డి గారు అనరు’ అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -