Thursday, May 2, 2024
- Advertisement -

ఒకే ఒక్కడు జగన్….. 2019లో జగన్ ప్రభంజనం: నటుడు పృథ్వీ

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు కోసం పనిచేసే జనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? చిన్న చితకా ఆర్టిస్ట్‌ల నుంచి మురళీ మోహన్, సురేష్ బాబు, రాఘవేంద్రరావులాంటి టాప్ రేంజ్ జనాల వరకూ అందరూ ఎన్నికల సమయానికి తమ కులాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం రెడీ అయిపోతారు. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కూడా మార్పు వస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ధైర్యంగా కమ్మకుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ ఉండడంతో టాలీవుడ్‌లో కులం గోడలు బద్ధలవుతున్నాయి.

ఆ విషయం పక్కనపెడితే థర్టీ ఇయర్స్ పృథ్వీగా పేరుగాంచిన పృథ్వీ తాజాగా వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. ఆ మధ్య జగన్ లండన్ వెళ్ళినప్పుడు పృథ్వీ లండన్‌లో జగన్‌ని కలిశాడట. అప్పుడు జగన్ అభిప్రాయాలు, ఆశయాలు తెలిశాయయని అనితర సాధ్యుడైన నాయకుడు జగన్ అని చెప్పుకొచ్చాడు పృథ్వీ. ఏళ్ళ తరబడి ప్రత్యేక హోదా కోసం పోరాడడం చిన్న విషయం కాదన్నాడు. అలా పోరాడిన ఒకే ఒక్కడు జగన్ అని ప్రశంశించాడు. అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడుతున్న జగన్‌లాంటి నాయకులు ఇంకా చాలా మంది రావాలని అభిప్రాయపడ్డాడు పృథ్వీ. చంద్రబాబుకు ఒక్కడికే విజన్ ఉంది అనుకుంటే తప్పని………జగన్‌కి అంతకుమించిన స్పష్టత, ఆశయాలు, ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు పృథ్వీ. నంది అవార్డుల్ని కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కున్నారని…….కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ ప్రభంజనాన్ని అలాంటి అక్రమ రాజకీయాలు అస్సలు అడ్డుకోలేవని చెప్పాడు పృథ్వీ. రాజకీయాల్లో నైతికత ముఖ్యమని……అలాంటి రాజకీయాలు చేస్తున్న జగన్‌ 2019లో జన ప్రభంజనం సృష్టించడం ఖాయమని అన్నాడు పృథ్వీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -