మంత్రి అఖిల ప్రియ…ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు బగ్గుమన్నాయి. ఇద్దరి మధ్య నిగురు కప్పిన నిప్పులా ఉన్న ఆస్తుల విబేధాలు మరో సారి బయటపడ్డాయి. గతంలో ఇద్దరి మధ్యనున్న విబేధాలను చంద్రబాబు సద్దుమనిగేలా చేశారు. కాని మరోసారి ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఏవి సుబ్బారెడ్డి ఆస్తులగురించి ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తుల మొత్తం చిట్టాను సేకరించే పనిలో ఆమె నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏవీతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు ఆ పార్టీకే చెందిన కొందరు నేతలు చెబుతున్నారు.
భూమాకు, ఏవీకి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మద్య ఎలాంటి విబేధాలు లేవు. నాగిరెడ్డి మరనించినత తర్వాత అఖిలప్రియ,సుబ్బారెడ్డి మధ్యనున్న విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో సారి ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది.
భూమా నాగిరెడ్డి హయాంలో ఏవీ.. ఒక సిమెంటు కంపెనీలో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టు సంపాదించారు. ఈ కాంట్రాక్టు ద్వారా ప్రతినెలా రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్టు తమకే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద వీరిద్దరి మధ్య నెలకొన్న తగాదా చిలికిచిలికి గాలివానలా మారి ఆస్తుల పంచాయితీ వరకూ వెళ్లినట్టు అర్థమవుతోంది.
ఎస్ఆర్డీఎస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఆధార్ నంబరు ఆధారంగా ఆస్తుల వివరాలను తెలుసు కొనె పనిలో బిజీగా అఖిల ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లను మంత్రి అఖిలప్రియ సంపాదించినట్టు సమాచారం. ఆస్తుల పంచాయితీ బాబు దగ్గరకు వెల్లేలా కనిపిస్తోంది. ఒవ వేల ఇద్దరి మధ్యనున్న ఆస్తుల విబేధాలు సద్దుమనుగకపోతె సుబ్బారెడ్డి పార్టీ మారడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.