Sunday, May 12, 2024
- Advertisement -

అనుకూల మీడియాలో పోటోల‌తో ప్ర‌చారం ….చంద్రబాబు వ్యూహాత్మకంగా తప్పిదం చేశాడా..

- Advertisement -

నంద్యాల‌లో గెలుపు కోసం చంద్ర‌బాబు మంత్రులు,ఎమ్మెల్యేల బృందాల‌ను దింపి ప్ర‌చారం మొద‌లు పెట్టారు.అయితే వీల్లంద‌రు హోట‌ల్ల‌లో కూర్చుకొని ఎన్నిక‌ల‌పై దృష్టికాకుండా జ‌గ‌న్‌ను వీలైనంత‌గా విరుచుకుప‌డ‌టం…ఇస్టాను సారం మాట్లాడ‌టం త‌ప్ప వీరి వ‌ల్ల ఒరిగిందేమిలేద‌న్న‌ది తెలుస్తోంది.నంద్యాల టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం మొద‌టికే మోసం వ‌చ్చేట్లుంది.అన‌వ‌స‌రంగా బాబు వ్యూహాత్మకంగా తప్పిదం చేశాడేమో అనే వాదన విన‌ప‌డుతోంది.

స్థానిక నేత‌లు కాకుండా ఎవరెవరినో తెచ్చి ప్రచారం చేయించడంతో కలుగుతున్న లాభం లేదని స్పష్టం అవుతుంది. బోండా ఉమ, అచ్చెన్నాయుడు, పరిటాలసునీత, అమరనాథరెడ్డి.. ఎవరండీ వీళ్లంతా! ఏ ఊరు వీళ్లిది. వీళ్ల నియోజకవర్గాలు, వీళ్ల ఏరియాల్లో జరుగుతున్న రచ్చలు నంద్యాల ప్రజలకు తెలియనవి కావు.

వీళ్లకు నంద్యాలతో సంబంధం లేదు కానీ, వీళ్ల ఘనచరిత్రలు మాత్రం నంద్యాల జనాలకు తెలుసు. సొంత నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్ వీళ్లు నెల నుంచి నంద్యాల్లో మకాం పెట్టి టీడీపీని గెలిపించడానికి తెగ కష్టపడుతున్న‌ట్లు పీల‌వుతున్నారు.

మీడియాలో హ‌డావుడి త‌ప్ప ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్ట‌డంలేదు. బాబు చేస్తున్న‌ ఓపెనింగ్స్ జనాలను టచ్ చేయడం లేదు. మరి పాతిక మంది ఎమ్మెల్యేలను, ఆరు మంది మంత్రులను, కర్నూలు జిల్లా టీడీపీ నేతలను నంద్యాలకు పంపారు కదా.. అంటే వాళ్లలో చాలా మంది లాడ్జుల్లో కూర్చుని రోజుకో ప్రెస్ మీట్ పెట్టి, అనుకూల పత్రికల్లో అచ్చేయించుకుని.. ప్రచారం పూర్తి అయ్యిందని అనిపిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=pzXC0MfaL94

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -