Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్ సోనియాకే భ‌య‌ప‌డ‌లేదు… వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

వైసీపీ త‌రుపున వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుక‌పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ విజ‌య‌మ్మ టీడీపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అక్ర‌మంగా జ‌గ‌న్‌పై కేసులు పెట్టి, జై ల్లో పెట్టించిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ నాకొడుకు జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌లేద‌ని….ఇప్పుడు భాజాపా భ‌య‌ప‌డుతున్నారంటూ తప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటె వైసీపీ అధికారంలోకి రావాల‌న్నారు. ప్రజల అభివృద్ధే జగన్ కు కావాలి. రాష్ట్రానికి మంచి చేయాలనే నిలబడ్డాడని తెలిపింది.చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కలిసి ఎన్నో కేసులు పెట్టారు. సీబీఐ, ఐటీ రైడ్స్ చేశారు. అటాచ్ మెంట్లు… ఆస్తులు అటాచ్ మెంట్ చేశారు. అప్పుడే భయపడలేదు నా కొడుకు. ఇప్పుడేం భయపడతాడు?” అని ఆమె వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాల‌ని ఓట‌ర్లకు పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -