కొన్నేళ్ల కిందట వరకు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కెరియర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అవకాశాలు రాక చేజారడం, పరిశ్రమలో హాస్య నటులకు తీవ్ర పోటీ ఏర్పడడంతో అతడు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాడు. అవకాశాలు రాక ఒకసారి మీడియా ముందు ఎవరిరెవరినో ఏకి పారేశాడు. తన అవకాశాలకు అడ్డపడుతున్న వ్యక్తిని పరోక్షంగా మాట్లాడిన అతడికి ఇక అవకాశాలే రాలేదు. ఇప్పుడు ప్రయత్నాల కోసం తెగ యత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పంచాన చేరాడు.
మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న అతడు ఎన్నికల్లో కూడా తెగ ప్రచారం చేశాడు. ఆయన్ను ప్రసన్నం చేసుకొని ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలోనే వేణుమాధవ్కు తీవ్ర అవమానం జరిగింది. ఇటీవల జరిగిన ఓ సభలో సీఎం చంద్రబాబు వెనుక వెళ్లి ఏదో చెబుతున్నారు. చంద్రబాబుకు చెప్పి అలాగే వెనక ఉండిపోయారు. ఎంతకు వెళ్లకపోవడంతో సీఎం భద్రతా సిబ్బంది వేణుమాధవ్ను నెట్టేశారు. ముందుకు వెళ్లమని తోసి వేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరలైంది. చంద్రబాబు తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ముందే నంది అవార్డుల లొల్లితో సతమతమవుతున్న ఆయనకు ఈ వీడియో తలనొప్పిగా మారింది.