Sunday, April 28, 2024
- Advertisement -

గీతాంజలి కుటుంబానికి అండగా సీఎం జగన్..

- Advertisement -

తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపై స్పందించారు సీఎం జగన్. గీతాంజలి ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేసిన జగన్..ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ ఒక్కరిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు జగన్. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

గీతాంజలి మరణం ప్రతి మహిళా బాధపడే విధంగా ఉందన్నారు మంత్రి రోజా. తనకు వచ్చిన ఇంటి పట్టాను మీడియాలో చూపించి మాట్లాడ్డం తప్పా? ..దీనికి అసభ్యకర పదజాలంతో వేధిస్తారా అని ప్రశ్నించారు రోజా. లోకేశ్ ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్ గా కానీ గెలవలేదని… అతడి మాటలకు విలువలేదన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి వీడియో ద్వారా వెల్లడించింది. దీనిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక గీతాంజలి ఆత్మహత్య అందరిని కలిచివేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -