Monday, May 6, 2024
- Advertisement -

ఏపీ కాంగ్రెస్…ఎన్నికల కమిటీ ఇదే

- Advertisement -

ఏపీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించి ముందుకు వెళ్తుండగా తాజాగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా షర్మిలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.

20 మంది సీనియర్ నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీలో రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, చింతా మోహన్, తులసి రెడ్డి తదితరులు ఉన్నారు.

ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టం హామీలు లాంటి కీలక అంశాలను ప్రస్తావిస్తు ముందుకు సాగుతున్నారు షర్మిల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -