వైసీపీలోకి వలసల జోరు ఆగడంలేదు. నిన్నట వరకు ఇతర పార్టీలనాయకులు, పారీశ్రామిక వేత్తలు, సినిమా నటులు చేరగా తాజాగా మాజీ డీజీపీ సాంబశివరావు కూడా త్వరలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్టణం జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పాదయాత్రలో ఉన్న జగన్ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలవడం రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపనలు వచ్చిన విషయం తెలసిందే. పాదయాత్రలో జగన్ను కలసిన ఆయన పార్టీలో చేరే విషయాన్ని జగన్ తో ప్రస్తావించినట్టు సమాచారం.
ప్రకాశం జిల్లా ఒంగోలు సాంబశివరావు స్వస్థలం.1987లో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పదోన్నతులు పొందతూ డీజీపీ స్థాయికి ఎదిగారు. ఏపీ డీజీపీగా చేసి గత ఏడాది ఆయన పదవీ విరమణ పొందారు.
సాంబశివరావు తమ పార్టీలోకి రావడం శుభ పరిణామమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తాము సాంబశివరావు సలహాలూ సూచనలూ తీసుకుంటామని చెప్పారు. జగన్ తో సాంబశివ రావు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు.