పాకిస్థాన్ దివంగత ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో చిన్న కుమార్తె అసీఫా భుట్టో జర్దారీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పాకిస్థాన్ ప్రజాస్వామ్య ఉద్యమ కూటమి (పీడీఎం) ఆధ్వర్యంలో ముల్తాన్లో సోమవారం నిర్వహించిన ర్యాలీ ద్వారా క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యం కోసం తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కోసం తన సోదరుడు బిలావల్ భుట్టో చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ముల్తాన్లోని ఘంట ఘర్ చౌక్లో సోమవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించింది పీడీఎం. ఈ సమావేశంలో జమైత్ ఉలేమా ఈ ఇస్లాం చీఫ్ మౌలానా ఫజ్లర్ రెహ్మాన్, పీఎంఎల్ ఎన్ ఉపాధ్యక్షులు మరియం నవాజ్ సహా పలువురు పీడీఎం నేతలు హాజరయ్యారు.
మీ సోదరుడు బిలావల్ భుట్టో జర్దారీ కరోనా వైరస్తో పోరాడుతున్న క్రమంలో నేను మీ మధ్యకు వచ్చాను. దేశ ప్రజాస్వామ్యానికి తల్లి, తూర్పు ప్రాంతానికి కూతురైన మా తల్లి బెనజీర్కు మద్దతు ఇచ్చినట్లే.. పీడీఎం వేదికగా బిలావల్ భుట్టో జర్దారీకి మద్దతుగా నిలవాలి అని అసీఫా భుట్టో జర్దారీ అన్నారు..
Also Read
ఊర్మిళా మొత్తానికి శివసేనలో..!