Friday, April 26, 2024
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ..!

- Advertisement -

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన నేడు ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ నిర్వాహకులతో కీలకంగా భేటీ అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. అంతకుముందు రజనీకాంత్ నివాసం ఎదుట అభిమానుల పోటెత్తారు.

రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబరు 12న ఆయన పుట్టినరోజు నాడు కీలక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే తాజా సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

దేశంలోనే జ‌గ‌నన్న బెస్ట్ సీఎం..!

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -