Friday, April 19, 2024
- Advertisement -

ఊర్మిళా మొత్తానికి శివసేనలో..!

- Advertisement -

ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్ శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే ఆధ్వర్యంలో ఆమె శివసేన కండువా కప్పుకున్నారు.

హిందీ, దక్షిణ భాషల్లో అనేక చిత్రాలు చేసిన ఊర్మిళ.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత కలహాలు, స్వార్థపూరిత రాజకీయాల మధ్య ఉండలేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారామె.

గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకుగాను ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి సిఫారసు చేసింది. ఈ జాబితాలో శివసేన నుంచి ఊర్మిళ పేరును సిఫారసు చేసింది. అప్పట్లోనే ఆమె శివసేనలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి.

Also Read

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

’సామ్ జామ్’ టాక్ షో కి సమంత పారితోషికం ఎంతంటే..?

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -