Saturday, May 4, 2024
- Advertisement -

ఆరునెలల వరుకు మారను: ట్రంప్

- Advertisement -

అమెరికా- 2020 అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ మోసాలు, అన్యాయాలపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం తనకు క్లిష్టమైన పనేనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యాయస్థానాలు కనీసం తన వాదనను వినిపించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించబోనని వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్‌. ఈ నేపథ్యంలో… తన వానదనలకు ఆధారాలు సమర్పించాలని తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నా కోర్టు జడ్జిలు మాత్రం కనీసం తమ వ్యాజ్యాలను స్వీకరించడం లేదని వాపోయారు. అయినప్పటికీ తమ న్యాయపోరాటం అగదని, ఇప్పటికే వందల కొద్ది వ్యాజ్యాలు కోర్టుల్లో వేశామని ట్రంప్​ వెల్లడించారు.

న్యాయవ్యవస్థే సరిగ్గా లేదంటూ డొనాల్డ్​ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఆరు నెలల పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి తన ఆలోచన సరళి మారబోదని చెప్పారు. న్యాయం కోసం తనకున్న శక్తిని 125 శాతం మేర వినియోగిస్తానన్నారు.

Also Read

ఆ కోర్టులో కూడా ట్రంప్ కి ఎదురుదెబ్బ..!

అమెరికా గడ్డ మీద ఇండియన్స్ కి గొప్ప పదవలు..!

అమెరికా నూతన అధ్యక్షుడికి గాయం..!

బైడన్ చూట్టూ.. మహిళలు నియామకం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -