భాజాపా తాడేపళ్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాల్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు.
తన నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయనివ్వకుండా స్థానికి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని వాపోయారు.తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.
15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతా. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నా. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.