Tuesday, April 30, 2024
- Advertisement -

పిల్ల సైకో…రెడీగా ఉండూ!

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం, స్కిల్స్ డెవలప్‌మెంట్, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ చేంజ్ ఇలా ప్రతిదాంట్లో అవినీతి జరిగిందని సీఐడీ అధికారుల ప్రాధమిక దర్యాప్తులో తేలిన సందర్భంగా టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. ఇక ఈ కేసులో ఏ1గా చంద్రబాబు ఉండగా,ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇక అలాగే నారా లోకేష్ పేరును కూడా రిమాండ్ రిపోర్టులో చేర్చింది సీఐడీ. దీంతో త్వరలోనే ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్ట్‌లు ఉండనున్నాయి.

ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి రోజా. పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం అని ట్వీట్ చేశారు లోకేష్.

దీనికి ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి రోజా. మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో. మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలతో ముంచేసినోడు మీ నాన్న. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.. జైలర్ సినిమాకి పంపిస్తారా? అంటూ రోజా ప్రశ్నించారు. పప్పుమీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే ఈ కుంభకోణంలో విచారణ జరుపుకొండి.. అని ధైర్యంగా చెప్పు అంటూ సవాల్ విసిరారు. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. బై బై తుప్పు.. బై బై పప్పు అని విమర్శలు కుప్పించారు.

ఇక ఈ కుంభకోణంలో లోకేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుండటం, కిలారీ రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని సీఐడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. మొత్తంగా అమరావతి నిర్మాణం సంగతేమో కానీ టీడీపీ పునాదులు మాత్రం కదిలిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -