Sunday, May 19, 2024
- Advertisement -

ఢిల్లీలో మోడీ , తెలంగాణలో కేసీఆర్ రీ డిజైన్ల స్పెష‌లిస్ట్‌లు..రాహుల్‌గాంధీ

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. సరూర్‌నగర్‌లోని స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విద్యార్థి- నిరుద్యోగ గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజలు కన్న కలలు సాకారం కాలేదని రాహుల్ విమ‌ర్శించారు. తెలంగాణ ఫలాలు అందరికీ అందడం లేదని, ఎన్నికల తర్వాత రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చారని, ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారి కోసం పలు వాగ్దానాలు చేశారు, కానీ, ఆ వాగ్దానాలను అమలు చేయలేదని విమర్శించారు.

తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్దామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడ ఆ ఆశలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైనా నాలుగేళ్లలో కనీసం 10 వేల ఉద్యోగాలను కూడ భర్తీ చేయలేదని రాహుల్ గాంధీ చెప్పారు.

రాఫెల్ విమానాల ధర చెప్పమంటే ఫ్రాన్స్ తో రహస్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి చెబుతున్నారని అన్నారు. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఈ రహస్య ఒప్పందం గురించి అడిగానని, రహస్య ఒప్పందమేమీ లేదని ఆయన చెప్పారని అన్నారు. తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసినప్పుడు తనతో పాటు ఆనంద్ శర్మ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారని చెప్పారు. రాఫెల్ కాంట్రాక్టును రీ డిజైన్ చేసి విమానాల తయారీలో అనుభవం లేని అనిల్ అంబానికీ కట్టబెట్టి వేల కోట్ల రూపాయల నజరానా ఇచ్చారని, ఇది వరకు ఇలాంటి అంశాలను ‘కుంభకోణం’ అనే వాళ్లమని, ఇప్పుడు ‘రీ డిజైన్’ అంటున్నారని రాహుల్ అభివర్ణించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రీ డిజైన్ లు చేసి డబ్బు దండుకుంటున్నారని, అంబేద్కర్ పేరున ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల పేరును కాళేశ్వరంగా మార్చి గారడీ చేశారని రాహుల్ ఆరోపించారు. రీడిజైన్ వల్ల రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు రూ.లక్ష కోట్లకు చేరిందని, టెండర్లు లేకుండా ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో మోదీ రీడిజైన్ చేశారని, తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.

మోదీ నోట్ల రద్దు చేస్తే.. కేసీఆర్‌ దానికి వంతపాడారని అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మోదీ, హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌లో కేసీఆర్‌ నిరసనలు చేపట్టనీయకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాహుల్‌ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది.

నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదమిచ్చారు. కానీ, బిహార్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలోని మహిళలపై ఇంతటి అమానుష ఘటనలు జరుగుతున్నా మోదీ మౌనం వీడడం లేదని రాహుల్‌ అన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -