సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అభిమాని ఒకరు ఆసక్తిదాయకమైన కానుకను అందించాడు. జగన్ కోసం వుడ్ చేసిన బైక్ ను కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరులో సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో అభిమాని ఈ కానుకను అందించాడు.
నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనకు సోమవారం దేవురపాలెంకు చెందిన కార్పొరేటర్ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్)తో చేసిన బైక్ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ …ఆ బైక్ ఎక్కి కొద్దిసేపు కూర్చొని అభిమానిని సంతోషపెట్టాడు.
సోమవారంతో జగన్ పాదయాత్ర 80వ రోజుకు చేరుకుంది. కోవూరు నియోజకవర్గం పరిధిలో రైతులతో సంభాషించారు వైకాపా అధినేత. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. రైతుల పరిస్థితి బాగుండేదని చెప్పారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.