ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించాడు. వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఖండువా కప్పుకున్నారు. అప్పుడు సంతోషంగా పార్టీలో చేరారు కాని ఇప్పుడు పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 16 మందికి చంద్రబాబు పగలు చుక్కలు చూపిస్తున్నారు.
వైసీపీ టిక్కెట్పై గెలిచి టీడీపీలోకి జంప్ అయిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మాత్రం చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. నంద్యా ల ఉప ఎన్నికలో ఐదుగురు ఎమ్మెల్యలు కోట్లాదిరూపాయలు డంప్ చేసి అభ్యర్తిని గెలిపించుకున్నారు. వాల్ల పరిస్థితి బాగానె ఉన్నా మిగిలిన 16 మంది మాత్రం అటు నియోజకవర్గాల్లో ప్రజలు, పాత టీడీపీ క్యాడర్ నుంచి ఓ వైపు, ఇటు చంద్రబాబు నుంచి మరోవైపు మద్దెలదరువు తప్పడం లేదట.
పార్టీ మారిన మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జ్ల పెత్తనమే కొనసాగుతోందట. ఈ విషయంలో చంద్రబాబు సైతం నేనే చూసుకుంటానేలే అని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పినా అభివృద్ధి పనులు, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో ఇన్చార్జ్ల హవా నడుస్తుండడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము డమ్మీలమా ? అని బాబుపై బాహాటంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ఇంటింటికి టీడీపీ కార్యక్రమలో వీల్లకు ప్రజలనుంచి చీత్కారాలు తప్పడంలేదు. ఎన్నికల్లో వైసీపీ తరపున ఓట్లు అడిగారు… ఫ్యాన్ గుర్తు పట్టుకు తిరిగి, ఇప్పుడు జెండా మార్చి సైకిల్ గుర్తు పట్టుకుని తిరుగుతున్నారేంటి ? అని ఓపెన్గానే ప్రశ్నిస్తుండడంతో వీరంతా వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో ? తెలియక సతమతమవుతున్నారు.
జమ్మలమడుగు, అద్దంకి, కదిరి, గిద్దలూరు, కందుకూరు, పాతపట్నం, పామర్రు ఇలా ఎక్కడ చూసినా నియోజకవర్గాల ఇన్చార్జ్లకు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదు. ఇక ఈ 16 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జ్లే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలగా మారిపోయారన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అటు ప్రజల నుంచి చీత్కారాలు, ఇటు నియోజకవర్గాల ఇన్చార్జ్లతో పొసగకపోవడం, అటు మంత్రులు, సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం, చివరకు నిధుల కేటాయింపులోను తీవ్ర వివక్ష ఎదురు కావడంతో ఇప్పుడు వారాంతా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటె వచ్చె ఎన్నికల్లో తమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తర లాగా తయారవుతుందని మదనపడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటె 2019 ఎన్నికల్లో ఏంచేయాలని ఆవేదన చెందుతున్నారు.