తెలంగాణా టీడీపీ బహిష్క్రతనేత సీనియర్ పొలిటిషియన్ మోత్కుపల్లి నర్సింహులు జనసేన గూటికి వెల్లడం దాదాపు ఖరారయ్యింది. ఈయన నేపథ్యం గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. టీడీపీలో దశాబ్దాల పాటు పని చేశాడు. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా నిలిచాడు.
మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తానని చెప్పిన బాబు చిరికి నామినేటెడ్ పోస్ట్కూడా ఇవ్వక పోవడంతో బాబుపై తీవ్రమైన విమర్శలు చేయడంతో పార్టీనుంచి బహిష్కరించారు. ఏపీలో బాబును ఓడించాలని
ఈ మేరకు తిరుమల శ్రీవారిని మొక్కుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేటి మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ను కలిసి మోత్కుపల్లి ఆ పార్టీలోకి చేరనున్నారని సమాచారం. ఈ సీనియర్ పొలిటిషియన్ను పవన్ కల్యాణ్ తన పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా నియమించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఏపీలో బాబు ఓటమి కోసం తను ప్రార్థిస్తున్నానని ప్రకటించుకున్నారు. బాబును ఓడించాలని ఏపీలో ప్రచారం చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవద్దని.. వైఎస్ జగన్ లేదా, పవన్ కల్యాణ్లకు ఓటు వేయాలని మోత్కుపల్లి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో పర్యటించి చంద్రబాబు మోసాలను ఎండగడుతానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించారు. జనసేనలో మోత్కుపల్లి చేరితో బాబుకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.