అసంతృప్తితో వెళ్లిపోయిన సీనియర్ నాయకుడు
రాజకీయంగా ఎన్నో కీలక పదవులు కూడా అనుభవించి సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు చివరికి తన అంతిమ కోరికను తీర్చుకోకుండానే వెళ్లిపోయాడు. ఈ కోరిక నెరవేర్చడంలో తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారు. ఆయన చివరి కోరికను తీర్చే అవకాశం ఉన్నా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఆయన హఠన్మరణం పొందారు. శేష జీవితాన్ని కొన్నాళ్లపాటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (టీటీడీ) సేవలో గడపాలని గాలి ముద్దు కృష్ణమ నాయుడి కల. తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబును అడిగారు. వయసులో కూడా సీనియర్ కావడంతో గాలి ముద్దుకృష్ణమను నియమించాలని పలుసార్లు అడిగారు. ఆ పదవిలో కూర్చొని రాజకీయాల్లో నుంచి నిష్క్రమించాలని అనుకున్నారు. కానీ అది తీరకుండానే వెళ్లిపోయాడు.
సీనియర్ వల్ల ఏమీ ఒరిగేందేమీ లేదని టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపలేదు. 2014 ఎన్నికల్లో గాలి ఓటమి చెందడంతో అతడిని బాబు పక్కన పెట్టేశారు. చివరికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఉంచారు. మంత్రి పదవి కూడా ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి తన కుమారుడు లోకేశ్కు అవకాశం ఇచ్చారు. సీనియర్ను విస్మరించారు. చివరికి ఏదో ఇవ్వాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరిపెట్టారు. కుల సమీకరణల ఒత్తిడిలో ఆయన గాలికి ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. జీవితంలో చివరి అంకంలో ‘ముద్దు’లో ఆ అసంతృప్తి, మనస్తాపం మిగిలిపోయి చనిపోయారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ముద్దు కృష్ణమ నాయుడికి ఆ ఒక్క పదవి వచ్చింటే సంతోషంగా వెళ్లిపోయి ఉండేవారు.