పవణ్ కళ్యాన్ పేరు వింటె చాలు పరిచయంలేని వ్యక్తి. రాష్ట్రవ్యాప్తంగా సినీపరంగా మంచి పాలోయింగ్ ఉన్న నేత. సామాజిక స్ప్రుహ కాస్త ఎక్కువే. దేశ వ్యాప్తంగా జరిగే సంఘటనలపై ట్విట్టర్లో స్పందిస్తుంటారు.అప్పుడప్పుడ ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు. ఉద్దానం కిడ్నీ బాధితులకోసం పోరాడుతున్నారు. అంతా బాగానె ఉందికాని.. ఇప్పుడు పవన్పై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ చేసిన వ్యాఖ్యలు ఎవరికి ఆమోదయోగ్యంగాలేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టే పవన్ పాలో అయ్యారనే భావన కలుగుతోంది. చంద్రబాబను ఒక్క మాట అనకుండా తెలివిగా మాట్లాడి సమస్యలమీద దాటవేశారు. పార్టీ ఫిరాయింపుల గురించీ, దళితులపై దాడుల గురించీ, ఆక్వాఫుడ్ పార్క్ ఆందోళనకారుల గురించీ.. పవన్కళ్యాణ్ మాట్లాడుతూ పదే పదే ‘మనం ఏం అర్థం చేసుకోవాలంటే.. అన్న మాటని ప్రస్తావించారు.
‘పార్టీ ఫిరాయింపులనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు..’ అంటూ ఓ చిన్న ‘పాజ్’ ఇచ్చారు పవన్కళ్యాణ్. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడారు.? అన్నదాని గురించి ఆలోచిస్తే ఎవరికీ ఏమీ అర్థం కాదు. ‘ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు..’ అన్న మాట రావడమంటేనే, ఆ విషయంలో తాను స్పందించడానికి ఏమీ లేదని ఆయన చెప్పేసినట్లే. రేపు జనసేనపార్టీకూడా దీనికి అనుకూలమే అన్న భావన కలుగుతోంది.
ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వమేమో ఆయన చేస్తున్న పాదయాత్రకు అనుమతిచ్చేది లేదంటోంది. పవన్కళ్యాణ్ మాత్రం అనుమతివ్వాలంటారు. మరి, ఆ విషయమ్మీద గట్టిగా మాట్లాడాలి కదా.? మాట్లాడరాయె.
పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ బాధితుల వ్యవహారంలోనూ పవన్ పూర్తిస్థాయిలో కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ బాధితుల తరఫున మాట్లాడాలనుకుంటూనే, ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనడానికి ఇష్టపడలేదాయన.దళితులపై దాడుల విషయంలోనూ పవన్కళ్యాణ్ది ఇదే తీరు.
ఆయనేం మాట్లాడతారో ఆయనకే తెలియదు..’ అన్న భావన ఇప్పుడు పవన్కళ్యాణ్ అభిమానుల్లోనే పెరిగిపోతోంది. రాష్ట్రంలో అన్ని సమస్యలకు ప్రభుత్వమే కారనం అన్నది తెలుసు. కాని ప్రశ్నిస్తానన్న పవన్ బాబును ఒక్క మాట అనకుండా వ్యవహరించడంతీరు చూస్తె ..ఇదంగా బాబు ఇచ్చిన స్క్రప్టే అని అర్థమవుతోంది. ఇదంతా చూస్తె ఆయన శాస్తాడు… ఈయన పాటిస్తాడు… ఇప్పుడు ఇదే సోషియల్ మీడియాలో హాట్టాపిక్.
https://www.youtube.com/watch?v=WhlLT8vhxDM