Tuesday, April 30, 2024
- Advertisement -

షాకింగ్ః టిడిపి కార్యకర్తలే చంద్రబాబుకు శఠగోపం పెట్టారా?

- Advertisement -

ఎన్టీఆర్ తెదేపాను స్థాపించినప్పటి నుంచీ పార్టీకి దన్నుగా ఉన్న కార్యకర్తలే ఇప్పుడు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారా? చంద్రబాబు ఆక్రోశం వెళ్ళగక్కేస్థాయిలో కార్యకర్తలు టిడిపి అధినేతకు, పార్టీకి చేసిన మోసం ఏంటి? ఇప్పుడు ఈ విషయాలే టిడిపిలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సాధారణంగా నాయకులే కార్యకర్తలకు వెన్నుపోటు పొడవడం జరుగుతూ ఉంటుంది. ఇక యూజ్ అండ్ త్రో పాలసీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు చాలా పెద్ద పెద్ద నాయకులకు, ఎన్టీఆర్‌కి, ఆయన తనయులకు, ఇప్పుడు నందమూరి వంశ ఆడబిడ్డలకు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు స్వయంగా టిడిపి కార్యకర్తలే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రీసెంట్‌గా తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టిడిపి పోటీ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఉన్నవారు సైతం టీడీపీకి ఓటు వేయలేదట. ఈ విషయాన్ని విశ్లేషణ చేసుకున్న చంద్రబాబు షాకయ్యాడట. టిడిపి సీనియర్ నేతలందరితో ఇదే విషయంపై మీట్ అయి తన ఆవేదన వ్యక్తం చేశాడట. కనీసం టిడిపి కార్యకర్తలు కూడా పార్టీకి ఓటు వేయకుండా ఉండే పరిస్థితి ఎందుకు వస్తోందని నిలదీశాడట. అయితే నాయకులు మాత్రం తప్పులన్నీ అధినేత చేసి మాపై అరిస్తే ఏం ఉపయోగం అని అంతర్గతంగా వాపోతున్నారు. నాయకుడి నిజాయితీపైన కార్యకర్తలకు నమ్మకం ఉండాలని………… ఇప్పుడు అలాంటి నమ్మకాన్ని తన అబద్ధపు రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలతో చంద్రబాబు పూర్తిగా పోగొట్టుకున్నారని టిడిపి నాయకులే అభిప్రాయపడుతున్నారు. రేపు ఎపిలో కూడా మీడియా బలం, డబ్బు బలంతో గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో కానీ కార్యకర్తల బలం, ప్రజాబలంతో గెలిచే అవకాశం అస్సలు లేదన్న విశ్లేషణలు టిడిపిలోనే వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -