నంద్యాల బహిరంగసభలో ప్రభుత్వంపై జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనే రాక్షసుడిని అంతం చేసేందుకు జరుగుతున్న కురుక్షేత్రంలో ప్రతిఒక్కరూ సవ్యసాచీలుగా మారాలని జగన్ పిలుపునిచ్చారు.కేశవరెడ్డి విద్యాసంస్థల కుంభకోణం బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులతో పాటు కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
చంద్రబాబు చొక్కా వదిలిస్తాం.. ఆది నారాయణరెడ్డి నిక్కర్ ఊడదీస్తాం. కేసులన్నీ తిరగతోడతాం. వారి నుంచి ఎలా వసూలు చేయాలో ప్రభుత్వం చూసుకుంటుంది. నంద్యాలలో మీరిచ్చే ఆశీస్సులు రేపటి విజయానికి పునాదులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కుతంత్రాలతో చంద్రబాబు మనుషులు ఇంటింటి వెళ్లి చెబుతున్నారట.. జగన్ ఇప్పుడే సీఎం కాదు కదా అని. నేను మీకు ఒకటే చెబుతున్నాను. ఇది ధర్మానికి ఆధర్మానికి జరుగుతున్న సంగ్రామం. ఈ ఎన్నికలతో జగన్ సీఎం ఇప్పుడే కాకపోవచ్చేమో.. కానీ 2019 కురుక్షేత్రం నంద్యాల నాంది అవుతుందన్నారు.