జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్నారు. సందర్భాను సారం ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే పవన్ తనని తాను ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఓవైపు ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నా.. అవాకులు చెవాకులు పేల్చుతున్న మీడియా నుంచి పవన్ కు పెద్దగా సపోర్ట్ లేదనే విషయం ప్రస్పుటం అవుతున్నట్లు తేలింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నపవన్ ఎవరు ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మిం నగర్ వర్గాల ప్రకారం పవన్ కల్యాణ్ గురించి ఓ వార్త సుడిగాలి పర్యటన చేస్తోంది. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ పర్యటనలు, పరామర్శలు, భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి పవన్ కల్యాణ్ కు తాము మద్దతు ఇస్తామంటూ రాంచరణ్, అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి మద్దతు గురించి స్పందించలేదు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మెగా కంపౌడ్ నుంచి చిరంజీవి, అల్లు అరవింద్ ల మద్దతు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి – అల్లు అరవింద్ లో పవన్ కు తెరవెనుక మద్దతిస్తు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ ప్రచారానికి మీడియా అధినేతలతో చిరంజీవి, అల్లు అరవింద్ పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెరవెనుక పవన్ కు మద్దతు పలుకుతు , ఆర్ధికంగా సపోర్ట్ చేసే నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ప్రముఖ ఛానళ్లలో వాటాలు కొనుగోలు చేసినట్లు.. వాటిద్వారా పవన్ పొలికల్ ఎజెండాను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాయబారాలు నడిపారని టాక్. అంతేకాదు ఛానళ్లలో వాటాలు ఉన్నాయి కాబట్టి పవన్ కు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి తెరవెనుక పవన్ కల్యాణ్ కు మద్దతు పలకడం గుర్తించ విషయం తెలిసిందే. అయితే దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదే జరిగితే పీఆర్పీ – 2 అని జనసేనకు ముద్రపడిపోవడం ఖాయమని అంటున్నారు.