- Advertisement -
రాష్ట్రంలో గత రెండు రోజులు ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై జనసేన అధ్యక్షుడు పవన్ తొలిసారిగా స్పందించారు. అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు.
ఆదాయపన్ను శాఖ దాడులపై మాట్లాడాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయంలో ఐటీ సోదాలు చేస్తే తాము కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాం.. కానీ ప్రయివేట్ సంస్థల్లో దాడులు చేస్తే, టీడీపీకి ఏంటి సంబంధం? దీనిపై కూడా ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని అన్నారు.