నంద్యాల ఉప ఎన్నిక చివరి అంకానికి చేరింది. అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 5 గంటగలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు నంద్యాలలో మకాం వేసి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీకి అన్ని వర్గాల ప్రజలనుంచి సంపూర్న మద్దతు లభించింది. ఈ వర్గాలనుంచె కాకుండా సినిమా స్టార్ హీరోల అభిమానుల మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే సూపర్స్టార్ కృష్న, మహేష్బాబు ప్యాన్స్ మద్దతును ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ మద్దతు దారులు, ఫ్యన్స్ కూడా వైసీపీకే నని ప్రకటించారు. దీంతో వైసీపీ శ్రేణులు దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు.
కొద్దిరోజుల క్రితం పవన్ మద్దతు తమ కుటుంబానికే ఉంటుందని ప్రకటించిన భూమా ప్యామిలీకి…ఇటు టీడీపీకి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరకి మద్దతివ్వమని జనసేన అధినేత ప్రకటించారు. తాజాగా జనసేన మద్దతు దారులు,పవన్ ఫ్యాన్స్తో వైసీపీ నేత అంబటి రాంబాబు ,ఇతర నేతలు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరడంతో…వైసీపీకే మద్దతు ఇస్తున్నట్లు జనసేన కార్యకర్తలు,ఫ్యాన్స్ ప్రకటించడంతో టీడీపీకి పెద్ద షాకే తగిలింది. ఇక వైసీపీ అభ్యర్తి శిల్ప గెలుపును ఎవరూ అపలేరని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.