Sunday, May 12, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఎప్పుడూ లేనంత స్థాయిలో జ‌రుగుతోంది. ఇన్నాల్లు ప‌వ‌న్ వైసీపీ, జ‌గ‌న్‌పైన చేసిన విమ‌ర్శ‌ల‌పై ఆచితూచి స్పందించినా ఇప్పుడు మాత్రం అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఉన్న‌ట్టుండి జ‌గ‌న్ ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్‌పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ప‌వ‌న్‌.

తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పులు రావాలని తాను కోరుకొంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు.సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్న తనపై బీజేపీ, వైఎస్ జగన్ విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకొన్న మీకే అంతుంటే నిజాయితీ పరుడైన నాకెంతుండాలి అంటూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం రాసింది చంద్రబాబునాయుడు,వైఎస్ జగన్ కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కొంత‌మంది నాయ‌కులు జ‌నం మ‌ధ్య త‌గాదాలు పెట్టి విభ‌జించి పాలిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అటువంటి వారినిని లువ‌రించి ధైర్యంగా ఎదుర్కోవ‌డానికే జ‌న‌సేన పార్టీని ప్రారంభించానని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -