Sunday, May 5, 2024
- Advertisement -

తెలంగాణా దెబ్బ‌కు విజ‌య‌వాడ క‌ర‌క‌ట్ట‌మీద ప‌డ్డావు..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై గులాబీ బాస్ త‌న వాగ్దాటి మాట‌ల‌తో చెడుగుడు ఆడుకున్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటైపోయారని బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం నాడు నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ బాబు ఇజ‌త్ తీశారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలేంటో ప్రజలకు తెలుసని అన్నారు. కుట్రల్లో కొత్త కుట్ర.. చంద్రబాబుతో కలిశారని మండిపడ్డారు. ‘వీళ్ల చిల్లర రాజకీయం కోసం నీచాతి నీచంగా దిగజారార‌ని విరుచుకు ప‌డ్డారు.

మనమిద్దం ఒకటవుదామని చెప్పినా… నా వెంబడి రాలేదు. అందుకే, మహాకూటమి వచ్చింది’ అని చంద్రబాబు అన్నాడు. అది మహాకూటమా? కాలకూటవిషమా? మహాకూటమా?మా తెలంగాణను నాశనం చేసే కూటమా?’ అని మండిపడ్డారు. నాలుగేళ్లూ మోదీ చంక నాకింది నీవు కాదాని బాబును ప్ర‌శ్నించారు.

నరేంద్ర మోదీ కాలు మొక్కి కదా నా ఏడు మండలాలు గుంజుకున్నావు.. నరేంద్రమోదీని అడ్డంపెట్టుకని గదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు.. నరేంద్ర మోదీని అడ్డు పెట్టుకుని గదా హైకోర్టు విభజన కానివ్వలేదు. ఇవి వాస్తవాలు కావు? ఈ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి రెండు వార్తా సంస్థలు. వాటిని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయగల్గు తాననుకుంటున్న చంద్రబాబునాయుడు. తెలంగాణ దెబ్బ ఏంటో ఒకసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్. మా బతుకులేదో మేము బతుకుతున్నాం.. ’ అంటూ చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.

తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమౌతోందో ఆలోచించుకోవాల్ననారు. చంద్రబాబునాయుడు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడని… కేసీఆర్ చెప్పారు. చంద్రబాబునాయుడు నయవంచకుడు,, నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. మాతో పెట్టుకొంటే ఖబడ్దార్ అంటూ కేసీఆర్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -