- Advertisement -
జగన్కు సొంతజిల్లాలో చెక్ పెట్టాలని టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. వైసీపీలో ఉన్న ముఖ్యమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలసి బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోకి రాకపోగా అదే పార్టీకి చెందిన నాయకులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారయణ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు చెన్నకేశవరెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజక వర్గ ఇన్చార్జ్ సుధీర్ రెడ్డి అధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయనకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.