లోక్ సభ ఎన్నికల్లో షెడ్యూల్ విడుదలైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పగా తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు పంపించిన రంజిత్ రెడ్డి…చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.ఇక తాజాగా జరగనున్న ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించారు రంజిత్. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. బీబీపాటిల్,రాములు బీజేపీలో చేరగా మిగితా వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.