Sunday, May 19, 2024
- Advertisement -

బాబుపై రివేంజ్…… వైకాపాలోకి భారీగా టిడిపి నేతలను చేరుస్తున్న ఆనం

- Advertisement -

వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు తీరు గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా వాడుకుని వదిలేసిన….అవమానించిన బాబుకు తన సత్తా ఏంటో చూపించాలని ఆనం రామానారాయణరెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే నెల్లూరు జిల్లాలో తనకు పరిచయం ఉన్న టిడిపి నాయకులు అందరినీ వైకాపాలో చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆత్మకూరు పరిధిలో ఉన్న స్థానికి టిడిపి నాయకులందరితో మీటింగ్ ఏర్పాటు చేశాడు రామనారాయణరెడ్డి.

ఈ మీటింగ్‌కి ఆత్మకూరు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆదిశేషయ్య, ప్రధాన కార్యదర్శి రవీంద్రారెడ్డి, అనంతసాగరం టిడిపి మండల అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి, మర్రిపాడు మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, ఒంటెద్దు కృష్ణారెడ్డి, ఆత్మకూరు రూరల్ టిడిపి మండల అధ్యక్షుడు కె. విజయభాస్కరరెడ్డి, ఏఎస్ పేట మండల టిడిపి ప్రధాన కార్యదర్శి సుధాకరరెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వర్లు……….ఇలా స్థానిక టిడిపి నాయకులు చాలా మంది ఆనంకి సంఘీభావం తెలిపారు. టిడిపి మంత్రులు సోమిరెడ్డి, నారాయణ లాంటి వాళ్ళు టిడిపి నాయకులు ఆనం మీటింగ్‌కి వెళ్ళకుండా చేేసే ప్రయత్నం చేశారు గానీ సక్సెస్ అవ్వలేకపోయారు. టిడిపిలో ఉన్నంత కాలం ఆనం పని అయిపోయింది అనే స్థాయిలో మాట్లాడుకున్న నేతలు కూడా ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డితో పాటు వైకాపాలో చేరుతున్న నాయకుల లిస్ట్ చూసి ఆశ్ఛర్యపోతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తరాలుగా ఉన్న ఆనం కుటుంబాన్ని అభిమానించే నాయకులు, కార్యకర్తలందరినీ కూడా వైకాపాలో చేర్చడమే ఆశయంగా పెట్టుకున్నాడు ఆనం రామనారాయణరెడ్డి. టికెట్ విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి హామీని ఇవ్వకపోయినప్పటికీ……………‘నీ భవిష్యత్‌ని నేను చూసుకుంటానన్నా…..నాన్నతో కలిసి పనిచేసిన మిమ్మల్ని అన్ని విధాలుగా గౌరవిస్తాను’ అని చెప్పిన జగన్ మాటలను నమ్మి 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధపడుతున్నాడు ఆనం. టిడిపి నాయకులు, చంద్రబాబు చేసిన అవమానానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని బాహాటంగానే చెప్తున్నాడు. ఈ పరిణామాలన్నీ టిడిపి నాయకుల్లో ఆందోళన పెంచుతుంటే……….వైకాపా కార్యకర్తల్లో మాత్రం ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -