వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారనె వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. త్వరలోనె ఆయన భాజాపా ఖండువా కప్పుకోనున్నారనె వ్యాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు, బీజేపీలో చేరబోతున్నట్లుగా వచ్చిన వార్తల విషయంలో ఇసుమంతైనా నిజం లేదని మేకపాటి స్పష్టం చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు సోనియాగాంధీ మహారాణిగా వెలుగొందుతున్నారని, ఆ సమయంలోనే తాను వైఎస్ఆర్సీపీలో చేరానని ఆయన గుర్తు చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్నేహితులు ఫోన్ చేశారని ….ఆవార్తల్లో నిజంలేదని చెప్పానన్నారు. తన కుటుంబ వ్యాపారానికి, తన రాజకీయ జీవితానికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు చేసుకునే తన కుమారులు అప్పుడప్పుడూ తనకు డబ్బులిస్తుంటారని చెప్పారు. ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని సూచించారు.