Monday, May 6, 2024
- Advertisement -

నాకు భయం లేదు.. పార్టీ నుంచి పారిపోయేవాళ్లు నాకు వద్దు : పవన్

- Advertisement -

రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

“నాకు మంచి యాక్టింగ్ కెరీర్ ఉంది. నిజజీవిత పరిస్థితులపై మాట్లాడితే కొందరు కొడతారనే భయం నాకు లేదు. ప్రాణాలు తీస్తారన్న భయం లేదు. నేను పార్టీ పెట్టిన సమయంలో నాతో మేధావులు ఎవరూ లేరు కులాలు కలుపుకుని రాజకీయాలు చేద్దామని కొందరు వచ్చారు. కానీ, నేను ఆ రోజున కేవలం యువతను నమ్మాను. నాకు తెలుసు, పార్టీలోకి వచ్చినోళ్లు మళ్లీ పారిపోతారని తెలుసు. ఒక్క అరుపు అరిస్తే పారిపోతారు.. అంతటి పిరికి వారు అయిపోయారు ఈ సమాజంలో. నాకు అలాంటి వారు అవసరం లేదు. పిడుగు మీద పడ్డా, ఫిరంగి వచ్చి తగిలినా గుండె ధైర్యం చూపుతూ నిలబడగలిగే వారు కావాలి.

రాజమండ్రిలో కవాతు చేసినప్పుడు పది లక్షల మంది వచ్చారు. అయితే, వారు ఓటు ఎవరికి వేశారు? నేరాలకు పాల్పడేవారికి వేశారు.. ఓటమిని అంగీకరించడం ఎంత కష్టమో నన్ను అడగండి చెబుతాను. ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. ఓటమిని అంగీకరించి నిలబడాలి. నేరస్తులను ప్రోత్సహించని రాజకీయాలు చేయాలి. ఇన్ని నీతులతో రాజకీయాలు చేస్తే నిలబడగలమా? అని కొందరు భావిస్తుంటారు. కచ్చితంగా నిలబడతాం” అని పవన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -