సిని నటుడు , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయలలోకి అడుగు పెట్టారు.ఇంత కాలం పరోక్ష రాజకీయలలో ఉంటు టీడిపికి అండగా ఉంటు వచ్చారు.ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయలలోకి యాత్ర ద్వార ప్రారంభిస్తున్నారు.అప్రహిత రాజకీయ యాత్రకు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఆయన భార్య అన్నా లెజ్నేవా వీరతిలకం దిద్దారు. సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి సాగనంపారు. సోమవారం హైదరాబాద్లోని నివాసం నుంచి పవన్ కొండగట్టుకు పయనమయ్యారు. దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనను అనుసరించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన యాత్ర ఉద్దేశాన్ని వివరించనున్నారు.
పవన్ యాత్రకు బయలుదేరనున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన ఇంటివద్ద ఆదివారం రాత్రి నుంచే హడావిడి కనిపించింది. సోమవారం ఉదయానికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రష్యన్ జాతీయురాలైన లెజ్నేవా.. తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ధరించారు. సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, బొట్టుపెట్టి భర్తను సాగనంపిన దృశ్యాలు చూసి అభిమానులు కేరింతలు వేశారు.